bharateeyudu: కమలహాసన్ 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్.. మూడు భాషల్లో నిర్మాతగా దిల్ రాజు!

  • తెరకెక్కనున్న భారతీయుడు-2
  • కమలహాసన్, శంకర్ కాంబినేషన్
  • ప్రస్తుతం చర్చల దశలో వున్న ప్రాజక్టు  

విలక్షణ నటుడు కమలహాసన్ నటించిన 'భారతీయుడు' సినిమా సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తండ్రీకొడుకుల పాత్రల్లో కమల్ విశ్వరూపం ప్రదర్శించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. 'భారతీయుడు-2' పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో కూడా కమలహాసనే మరోసారి విశ్వరూపం చూపించబోతున్నారు. అగ్ర దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మూడు భాషల్లోనూ నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. 

  • Loading...

More Telugu News