samna: ఇండియా అంటే హిందువులదే... ముస్లింలకు కావాలంటే 50 దేశాలున్నాయి: శివసేన

  • హిందుత్వ అనుకూల అజెండాను ముందుకు తీసుకెళ్లాలి
  • ఘర్ వాపసీ, రామమందిర నిర్మాణం తప్పనిసరి
  • 'సామ్నా' పత్రికలో శివసేన వ్యాఖ్య

ఇండియా అంటే తొలుత హిందువుల రాజ్యమేనని శివసేన కీలక వ్యాఖ్యలు చేసింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హిందుత్వ అనుకూల అజెండాను ముందుకు తీసుకెళ్లాలని, రామ జన్మభూమి వివాద పరిష్కారం, ఘర్ వాపసీ వంటి కార్యక్రమాలను చేపట్టాలని, కాశ్మీరీ పండిట్లు తిరిగి తమ స్వస్థలాలకు ధైర్యంగా వెళ్లేలా చూడాలని తన అధికార 'సామ్నా' పత్రికలో వ్యాఖ్యానించింది.

 'హిందుస్థాన్ అంటే హిందూ దేశం' అన్నంత మాత్రాన మిగతా వారికి హక్కు లేదని కాదు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఇండియా హిందువులకే తొలుత చెందుతుందని వ్యాఖ్యానించింది. ముస్లింలకు 50కి పైగా దేశాలున్నాయని తెలిపింది. అమెరికా, యూరప్ దేశాలు క్రిస్టియన్లకు ఉన్నాయని, చైనా, జపాన్, శ్రీలంక, మయన్మార్ లు బౌద్దులకు ఉన్నాయని, హిందువులకు మాత్రం ఓ దేశమన్నది లేకుండా పోయిందని 'సామ్నా' పేర్కొంది. హిందువులంతా అయోధ్యలో రామమందిరాన్ని కోరుకుంటున్నారని, హిందుత్వ అనుకూల ప్రభుత్వం ఉండటంతో ఈ వివాదం కొలిక్కి వస్తుందని గట్టిగా నమ్ముతున్నారని అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News