నిర్మల సీతారామన్: రూ.21,738 కోట్లతో 111 హెలికాప్టర్ల కొనుగోలుకు ఆమోదం

  • మ‌రింత శ‌క్తిమంతం కానున్న భార‌త నేవీ
  • నిర్మల సీతారామన్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన సమావేశంలో నిర్ణయం
  • 95 హెలికాప్టర్లను మన దేశంలోనే తయారు చేయించాల‌ని ప్ర‌తిపాదన‌

భారత నేవీ మ‌రింత శ‌క్తిమంతం కానుంది. రూ.21,738 కోట్లతో 111 హెలికాప్టర్లను కొనుగోలు చేయాల‌ని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఆధ్వ‌ర్యంలో ఈ రోజు జ‌రిగిన ఓ సమావేశంలో భాగంగా ఈ నిర్ణయంపై ఆమోదముద్ర వేశారు. 111 హెలికాప్టర్లలో ఫ్లై ఎవే కండిషన్‌పై 16 హెలికాప్టర్లు కొనాల‌ని నిర్ణ‌యించారు. మిగ‌తా 95 హెలికాప్టర్లను మన దేశంలోనే తయారు చేయించాల‌ని ప్ర‌తిపాదించారు. ఈ హెలికాప్ట‌ర్ల‌ను తయారు చేసే ఏదైనా ఓ విదేశీ సంస్థ, భారతదేశానికి చెందిన రక్షణ రంగ సంస్థ కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణ‌యం తీసుకున్నారు. 

  • Loading...

More Telugu News