Himachalpradesh: కోటీశ్వరుల మధ్య కొట్లాట.. హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో 158 మంది మల్టీ మిలియనీర్లు!

  • ఈనెల 9న హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
  • బరిలో కోట్లకు పడగలెత్తిన నేతలు
  • 68 మందిపై క్రిమినల్ కేసులు

ఈనెల 9న హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. గెలుపు కోసం రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 338 మంది అభ్యర్థులు నిలబడ్డారు. వీరిలో 158 మంది మల్టీ మిలియనీర్లు కావడం విశేషం.

అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను బట్టి ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో 68 మంది ఆస్తులు రూ.8.56 కోట్లకు పైనే.  68 మంది బీజేపీ అభ్యర్థుల ఆస్తులు రూ.5.31 కోట్లకు పైనే. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన 42 మంది అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.46.78 లక్షలు.

కాగా,  పోటీలో ఉన్నవారిలో 61 మంది (18 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. తమపై నేరారోపణలు ఉన్నట్టు ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో వీరు పేర్కొన్నారు. వీరిలో 31 మందిపై తీవ్ర నేరారోపణలు ఉండడం గమనార్హం. వీరిలో ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థులు కాగా, 23 మంది బీజేపీ అభ్యర్థులు.  మొత్తం అభ్యర్థుల్లో సగం మంది కంటే ఎక్కువ మంది వయసు 50 ఏళ్లపైనే కాగా ఒకరి వయసు మాత్రం 80 ఏళ్లు. అలాగే సగం కంటే ఎక్కువ మంది (63 శాతం) గ్రాడ్యుయేట్లు. మొత్తం 338 మంది అభ్యర్థుల్లో కేవలం ఆరు శాతం అంటే 19 మంది మాత్రమే మహిళలు కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News