Jagan: రోడ్డు పక్కన టీ తాగి, బ‌న్ తిన్న వైఎస్‌ జ‌గ‌న్‌!

  • 27వ రోజుకి చేరుకున్న జ‌గ‌న్ పాద‌యాత్ర‌
  • ప్ర‌స్తుతం అనంత‌పురంలోని గుత్తిలో వైసీపీ అధినేత‌
  • జ‌గ‌న్‌కి టీ, బ‌న్ ఇచ్చిన ఓ అభిమాని

క‌ర్నూలులో పాద‌యాత్ర‌ను పూర్తి చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌స్తుతం అనంతపురంలో ప‌ర్య‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్‌ను చూడ‌డానికి ప్ర‌జ‌లు భారీ ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు. గుత్తి శివార్లలో ఓ వ్య‌క్తి జగన్‌కు టీ, బన్ ఇచ్చాడు. వాటిని స్వీకరించిన జ‌గ‌న్ టీ తాగుతూ, బ‌న్ తింటూ అత‌డితో మాట్లాడారు. సాధార‌ణ వ్యక్తిలా జ‌గ‌న్ రోడ్డు పక్కన టీ తాగ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

త‌న పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ ఉల్లి రైతులతో మాట్లాడి వారి క‌ష్టాల‌ను గురించి తెలుసుకున్నారు. గుత్తిలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో మాట్లాడుతూ జ‌గ‌న్‌ ముందుకు క‌దులుతున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర చేప‌ట్టి నేటితో 27 రోజులు గ‌డుస్తోంది. 

  • Loading...

More Telugu News