akash piri: తెలుగు తెరకి కొత్త విలన్ ను పరిచయం చేస్తోన్న పూరీ

  • షూటింగు దశలో 'మెహబూబా'
  • తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో 
  • విలన్ పాత్రలో షేక్ జునైద్ 
  • కథానాయికగా నేహా శెట్టి  

'పైసా వసూల్'తో మాస్ ఆడియన్స్ ను .. బాలకృష్ణ అభిమానులను మెప్పించిన పూరీ జగన్నాథ్, తన తదుపరి సినిమాగా 'మెహబూబా' చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా ఆయన తన తనయుడు ఆకాశ్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. 1971 ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలోని ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

కన్నడ హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకి పరిచయమవుతోంది. అంతేకాదు, ఈ సినిమాతో షేక్ జునైద్ విలన్ గా తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో తాను చేస్తోన్న పాత్ర ఎంతో విలక్షణంగా ఉంటుందనీ, తనకి మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకాన్ని జునైద్ వ్యక్తం చేశాడు. ఈ సినిమా తనకి టాలీవుడ్లో మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని చెప్పాడు. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది.      

  • Loading...

More Telugu News