mothkupalli: తెలుగు జాతి ఔన్నత్యాన్ని పెంచిన మహనీయుడు ఎన్టీఆర్‌ని కేసీఆర్ విస్మ‌రిస్తున్నారు: మోత్కుప‌ల్లి

  • ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో ఎన్టీఆర్‌ను ఎందుకు విస్మ‌రిస్తున్నారు?
  • కేసీఆర్ త‌న‌కు చదువు చెప్పిన గురువుకు నమస్కరించారు
  • మ‌రి త‌న‌ రాజకీయ గురువును ఎందుకు గుర్తించ‌డం లేదు
  • కేసీఆర్‌తో పాటు ఎంతో మందికి ఎన్టీఆర్‌ రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చారు

తెలుగు జాతి ఔన్నత్యాన్ని పెంచిన మహనీయుడు ఎన్టీఆర్‌ని తెలంగాణ ప్ర‌భుత్వం విస్మ‌రించ‌డం ఏంట‌ని టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్ర‌శ్నించారు. త‌న‌కు చదువు చెప్పిన గురువుకు హైదరాబాద్‌లో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హిస్తోన్న ప్రపంచ తెలుగు మహాసభల్లో నమస్కరించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్.. మ‌రి రాజకీయ గురువును ఎందుకు గుర్తించ‌డం లేద‌ని అన్నారు. ఈ రోజు మోత్కుప‌ల్లి హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో ఎన్టీఆర్‌ను విస్మరించడంపై ప్రపంచంలోని తెలుగువారంతా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ని అన్నారు. కేసీఆర్ తీరు బాగోలేద‌ని మండిప‌డ్డారు. కేసీఆర్‌తో పాటు ఎంతోమందికి ఎన్టీఆర్‌ రాజకీయ జీవితాన్ని ఇచ్చార‌ని అన్నారు.   

  • Loading...

More Telugu News