suicide: ప్రేమ వ్య‌వ‌హారం.. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌!

  • మహబూబాబాద్‌ పట్టణ శివారులోని సిగ్నల్‌ కాలనీలో ఘ‌ట‌న‌
  • ప్రేమికుడు కార్తీక్‌ మోసం చేయ‌డంతో శిరీష అనే బాలిక మ‌న‌స్తాపం
  • పురుగుల మందుతాగిన వైనం
  • ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి

మహబూబాబాద్‌ పట్టణ శివారులోని సిగ్నల్‌ కాలనీలో శిరీష అనే బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకుంది. స్థానిక‌ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోన్న ఆమెకు స్థానిక యువ‌కుడు కార్తీక్‌తో ఏర్ప‌డిన‌ పరిచయం ప్రేమ‌గా మారింది. చివ‌ర‌కు ఆ యువ‌కుడు ఆమెను పెళ్లి చేసుకోన‌ని చెప్పడంతో, శిరీష ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరించింది.

ఆ యువ‌కుడు 'నీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు చేసుకో..పో' అంటూ తిట్టి పంపించాడు. దీంతో శిరీష పురుగుల మందు తాగింది. మానుకోట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. స‌ద‌రు ప్రియుడిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.   

  • Loading...

More Telugu News