washing mission: పదిహేనేళ్లుగా దొర‌క‌ని నిందితుడు.. చివరికి ఇంట్లో వాషింగ్ మిష‌న్‌లో దొరికిన వైనం!

  • ముంబయిలో ఘటన
  • బీఈడీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తానని ముగ్గురు అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు
  • నిందితుడిపై మరిన్ని కేసులు
  • పోలీసులకు తన భర్త ఇంట్లో లేడని చెప్పిన భార్య

ముంబయిలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. 15 సంవ‌త్స‌రాల ముందు బీఈడీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తానని చెప్పి ముగ్గురు అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకున్న ఓ వ్యక్తి వారిని మోసం చేసి ఆ డబ్బులతో పారిపోయాడు.  దీంతో సదరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై మరిన్ని కేసులు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి ఆ నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నిన్న మరోసారి పోలీసులు అతడి ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. మొదట నిందితుడి భార్య పోలీసులను ఇంట్లోకి రానివ్వలేదు. ఎట్టకేలకు ఆమెను ఒప్పించిన పోలీసులు లోపలికి వెళ్లి వెతికారు. ఇల్లు మొత్తం వెతికినా లాభం లేకపోవడంతో తిరిగి వెళ్లిపోతూ వాషింగ్‌మిషన్‌ను తెరిచి చూశాడు. అందులో బట్టల కింద నిందితుడు కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

  • Loading...

More Telugu News