Richa: 'మిర్చి' భామకు అభిమానులపై కోపమొచ్చింది!

  • ఆమధ్య సినిమాలకు బై చెప్పిన రిచా 
  • చదువు కోసమంటూ అమెరికా చెక్కేసిన భామ 
  • తెలుగు, తమిళ సినిమా వేడుకలపై వ్యంగ్యం  
  • అభిమానుల నుంచి విమర్శల వెల్లువ

'మిర్చి' కథానాయిక రిచా గంగోపాధ్యాయ్ గుర్తుందిగా?
ఆమధ్య సినిమాలకు గుడ్ బై చెప్పేసి, యూనివర్శిటీలో చదువుకుంటానంటూ చెప్పి అమెరికాకు వెళ్లిపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త కోపంగా ట్వీట్ చేసింది. అభిమానులు తనను విమర్శిస్తూ కామెంట్లు చేయడం అమ్మడికి నచ్చలేదు. అందుకే వాళ్లపై కోపం ప్రదర్శిస్తూ, 'పొండి ..ఇకపై మాట్లాడను' అంటూ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఇటీవల ఈ చిన్నది మన సినిమా ఫంక్షన్లను ఎద్దేవా చేస్తూ కామెంట్ చేసింది.

'ఏమిటో.. హాలీవుడ్ లో ఇలా వుండదు.. ఒక్క తెలుగు, తమిళ భాషల్లోనే సినిమాలకు ఏనివర్శరీ ఫంక్షన్లు చేస్తారు.. అలా ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు' అంటూ రిచా పెట్టిన పోస్టుకి అభిమానుల నుంచి విమర్శల కామెంట్లు వెల్లువెత్తాయి. దీంతో ఈ చిన్నదానికి కోపమొచ్చేసింది. దాంతో, 'ఇకపై నా అభిప్రాయాలను ఇక్కడ వెల్లడించను. చెప్పిన దాకా వుండి విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. అందుకే ఇకపై మాట్లాడను. అసలు ఈ పని ఎప్పుడో చేసి వుండాల్సింది' అంటూ కాస్త ఘాటుగానే అమ్మడు ట్వీట్ చేసింది. ఏమైనా, అభిమానులపై అలా కోపగిస్తే నష్టం ఎవరికో మరి!      

  • Loading...

More Telugu News