Hyderabad: ఒంటరిగా నివసిస్తోన్న యువతిని దారుణంగా హత్య చేసిన దుండగులు

  • హయత్‌నగర్‌లో ఘటన
  • దేవరకొండకు చెందిన అనూషగా గుర్తించిన పోలీసులు
  • తలపై బండరాయితో మోది హత్య చేసిన‌ దుండగులు

ఒంటరిగా నివసిస్తోన్న ఓ యువతిని కొంద‌రు దుండ‌గులు దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప‌రిశీలించారు. ఆమె దేవరకొండకు చెందిన అనూషగా గుర్తించిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఆమెను కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు తలపై బండరాయితో మోది హత్య చేసిన‌ట్లు పోలీసులు వివ‌రించారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.         

  • Loading...

More Telugu News