Sridevi: మిస్టరీగా మారిన శ్రీదేవి మృతి.... పలు అనుమానాలు!

  • శ్రీదేవి మృతిపై రకరకాల కథనాలు 
  • బాత్ టబ్ లో పడి మృతి చెందడం సాధ్యమేనా?
  • అసలు శ్రీదేవి అపస్మారక స్థితిలోకి ఎందుకు వెళ్లింది?

ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతి మిస్టరీగా మారింది. శ్రీదేవి మృతిపై గంటకో సమాచారం వెలువడుతుండడంతో ఆమెది ప్రమాదవశాత్తు కలిగిన మరణమా? లేక హత్యా? అన్న అనుమానాలు రేగుతున్నాయి. అంతేకాకుండా దుబాయ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ పేరుతో విడుదలైన ఫోరెన్సిక్ రిపోర్ట్ మరెన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ అనుమానాలను మరింత పెంచుతూ సోషల్ మీడియా కథనాలు మరింత గందరగోళానికి దారితీస్తున్నాయి. ఆమె కుటుంబీకులు చెప్పినట్టు ఆమె గుండెపోటుతో మృతి చెందలేదన్నది మాత్రం వాస్తవమని తేలింది.

బాత్ టబ్ లో పడి మరణించిందన్న దుబాయ్ ఫోరెన్సిక్ నిపుణుల రిపోర్టు ప్రకారం చూస్తే, సాధారణమైన బాత్ టబ్ లో ఒక పెద్ద మనిషి పడి మృతి చెందడం సాధ్యమేనా? అన్న అనుమానాలు రేగుతున్నాయి. అసలు శ్రీదేవి అపస్మారక స్థిితిలోకి ఎందుకు వెళ్లింది? హోటల్ గదిలో ఏం జరిగిందన్న విషయాలు అభిమానుల్లో పలు అనుమానాలు రేపుతున్నాయి. కాగా, దుబాయ్ పోలీసులు శ్రీదేవి మృతి కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు బదలాయించారు. అక్కడ గంటల తరబడి దర్యాప్తు జరుగుతోంది. అన్నీ పూర్తయితే కానీ శ్రీదేవి మృతదేహం భారత్ కు రాదని తెలుస్తోంది. ఇక్కడ ఆమె అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసి, కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News