nagashaurya: మే నెలలో సెట్స్ పైకి 'నర్తనశాల'

  • నాగశౌర్య హీరోగా 'నర్తనశాల'
  • దర్శకుడిగా శ్రీనివాస్ పరిచయం
  • మే నుంచి రెగ్యులర్ షూటింగ్ 

'ఛలో' సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న నాగశౌర్య .. ప్రస్తుతం 'అమ్మమ్మగారిల్లు' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా షామిలి నటిస్తోంది. ఈ సినిమా తరువాత నాగశౌర్య 'నర్తనశాల' అనే సినిమా చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. నాగశౌర్య సొంత బ్యానర్లోనే ఈ సినిమా నిర్మితం కానుంది.

గతంలో కృష్ణవంశీ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేసిన శ్రీనివాస్, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మాస్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటోంది. మే నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. కథానాయికతో పాటు ఇతర నటీనటులు ఎవరనే వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. 

  • Loading...

More Telugu News