Cricket: పీఎస్ఎల్ లో కోహ్లీ ఆడాలి.. పాక్ అభిమానుల డిమాండ్!

  • స్పాట్ ఫిక్సింగ్ కారణంగా ప్రతిష్ఠ కోల్పోయిన పీఎస్ఎల్ 
  • వీక్షకులు లేక వెలవెలబోతున్న స్టేడియంలు
  • కోహ్లీ ఆడాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న అభిమానులు

పీఎస్ఎల్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడాలని పాక్ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. యూఏఈ వేదికగా పీఎస్ఎల్ (పాకిస్థాన్ క్రికెట్ లీగ్) ను పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్ తో ఈ టోర్నీ ప్రతిష్ఠ మసకబారిపోయింది. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా వరుసగా పలువురు పాక్ క్రికెటర్లు నిషేధం శిక్షకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పీఎస్ఎల్ కు ప్రేక్షకాదరణ తగ్గిపోయింది. వీక్షకులు లేక స్టేడియంలు వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ అభిమానులు పీఎస్ఎల్ లో కోహ్లీ ఆడాలంటూ టోర్నీలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.
  

  • Loading...

More Telugu News