New Delhi: ఢిల్లీలో దారుణం: గొడవ వద్దన్నందుకు యువకుడిపై కత్తులతో దాడి!

  • హోలీ సందర్భంగా ఘర్షణ
  • బాలుడిపై దాడి చేసిన యువకులను వారించిన ఆశిష్ 
  • ఆశిశ్ పై 20 మంది యువకుల దాడి

దేశరాజధాని ఢిల్లీలో హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. పట్టపగలు అందరూ చూస్తుండగా సుమారు 20 మంది యువకులు ఒక వ్యక్తిని చుట్టుముట్టి, కర్రలు, రాడ్లతో కొడుతూ, క్షణాల్లో 50 సార్లు కత్తులతో పొడిచేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలోని ఖాన్‌ పూర్‌ లో హోలీ వేడుకల సందర్భంగా ఓ బాలుడు రంగుల బెలూన్లను ఇద్దరు వ్యక్తులపై పొరపాటున విసిరాడు. దీంతో వారు ఆ బాలుడిని చితకబాదారు. దానిని చూసిన ఆశిష్ అనే యువకుడు జోక్యం చేసుకుని, బాలుడ్ని వారి బారినుంచి కాపాడాడు.

దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువకులు ఆశిష్ అంతు చూస్తామని బెదిరించి వెళ్లారు. సాయంత్రం జిమ్ నుంచి ఆశిష్ బయటకు రాగా, వేగంగా దూసుకొచ్చిన 10 బైక్‌ లపై సుమారు 20 మంది యువకులు దిగి, అతనిపై కర్రలు, రాడ్లు, కత్తులతో దాడికి దిగారు. ఒకేసారి అంతమంది దూసుకురావడంతో ఆశిష్ ప్రతిఘటించలేకపోయాడు. క్షణాల్లో దాడి చేసిన యువకులు అతనిని 50 కత్తిపోట్లు పొడిచి పారిపోయారు. ఈ ఘటన సీసీ టీవీలో రికార్డైంది. స్థానికులు ఆశిష్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News