Sridevi: అన్నీ చెబుతున్నారు... శ్రీదేవి ఎలా స్పృహతప్పిపోయిందో చెప్పరేం?: నిలదీస్తున్న అభిమానులు

  • స్పృహతప్పిపోయి బాత్ టబ్ లో పడి మృతి చెందిన శ్రీదేవి
  • శ్రీదేవి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు
  • సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్న వైనం 

దిగ్గజ సినీ నటి, దివంగత శ్రీదేవి మరణించి రోజులు గడుస్తున్నప్పటికీ ఆమె మృతి పట్ల తమకు ఉన్న ఒకే ఒక్క అనుమానాన్ని ఎందుకు నివృత్తి చేయడం లేదని ఆమె అభిమానులు సౌదీ ప్రాసిక్యూషన్ విభాగంతో పాటు ఆమె కుటుంబ సభ్యులను సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. ఫిబ్రవరి 24 రాత్రి దుబాయ్ లోని ఒక హోటల్ లో శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి మృతి చెందారని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే ఆ నివేదికలో ఆమె స్పృహ తప్పిపడిపోవడానికి గల కారణాలను వివరించలేదు. దీంతో అభిమానుల్లో ఆ అనుమానం అలాగే ఉండిపోయింది. వివాహ వేడుకలో సరదాగా గడిపిన ఆమెకు పెద్దగా అనారోగ్యం లేదని, ఆమెకు మద్యం అలవాటు కూడా లేదని అమర్ సింగ్ చెప్పడంతో మరి ఆమె స్పృహతప్పడానికి గల కారణమేంటని వారు నిలదీస్తున్నారు. కనీసం కుటుంబ సభ్యులు కూడా దీనిపై స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, శ్రీదేవి మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. 

  • Loading...

More Telugu News