muthamsetty srinivasa rao: మోదీ, పవన్ ఉన్న ఫ్లెక్సీని వెంటనే తొలగించండి: టీడీపీ ఎంపీ ఆదేశం

  • ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఫ్లెక్సీలో మోదీ, పవన్
  • టీడీపీతో వారికి సంబంధం లేదన్న ముత్తంశెట్టి
  • ఫ్లెక్సీ మార్చాలంటూ అనుచరులకు సూచన

తన క్యాంప్ కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీని వెంటనే తొలగించాలంటూ టీడీపీ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు తన అనుచరులను ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంలో ఉన్న ఓ ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల ఫొటోలు కూడా ఉన్నాయి.

 నిన్న కార్యాలయానికి వచ్చిన ఆయన... ఫ్లెక్సీలో ఉన్న మోదీ, పవన్ ఫొటోలను చూశారు. ఈ సందర్బంగా ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చేసిందని, టీడీపీపై జనసేన ఎదురు తిరిగిందని, ఈ నేపథ్యంలో మోదీ, పవన్ ల ఫొటోలు మన ఫ్లెక్సీల్లో అవసరం లేదని.. వెంటనే ఫ్లెక్సీని మార్చాలని ఆదేశించారు. 

  • Loading...

More Telugu News