narasimharaju: ఎన్టీఆర్ .. ఏఎన్నార్ వల్ల నాకు అవకాశాలు తగ్గాయనడంలో నిజం లేదు: నరసింహరాజు

  • ఎన్టీఆర్ .. ఏఎన్నార్ నన్నెంతో అభిమానించారు
  • వాళ్ల వలన నాకు ఎలాంటి అన్యాయం జరగలేదు
  • ఈ విషయంపై జనంలో వున్నది అపోహ మాత్రమే  

         


ఒక వైపున సాంఘిక చిత్రాలతోను .. మరో వైపున జానపద చిత్రాలతోను నరసింహరాజు అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే గోదావరి జిల్లాల్లో తుపాను రావడం .. ఎన్టీఆర్ - ఏఎన్నార్ లు కలిసి విరాళాలు వసూలు చేయడం జరిగింది. అదే సమయంలో వాళ్లను విమర్శిస్తూ నరసింహరాజు మాట్లాడాడంటూ అప్పట్లో వార్తలు షికారు చేశాయి.

ఆ తరువాత నరసింహరాజుకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అందుకు ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లు కారణమనే ప్రచారం కూడా జరిగింది. ఆ విషయానికి సంబంధించిన ప్రస్తావన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో వచ్చింది. అప్పుడు నరసింహరాజు మాట్లాడుతూ "నేను ఏదో అనేశాననే ప్రచారం జరిగినా .. ఎన్టీఆర్ - ఏఎన్నార్ లు నన్ను అభిమానించారేగానీ, నాకు చెడు చేయలేదు. ఆ తరువాత ఏఎన్నార్ తో కలిసి నేను 3 సినిమాలు కూడా చేయడం జరిగింది. వాళ్ల వలన నాకు అన్యాయం జరిగిపోయిందనే అపోహ జనంలో వుంది. అది అపోహనే గానీ .. అందులో నిజం లేదు .. ఎవరివలనా నాకు ఎలాంటి ద్రోహమూ జరగలేదు" అని చెప్పుకొచ్చారు.         

  • Loading...

More Telugu News