Karnataka: కర్ణాటక ఎన్నికల తరువాత బీజేపీ, వైసీపీ తమ బుద్ధిని బయటపెడతాయి: అచ్చెన్నాయుడు

  • బీజేపీ నాయకులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు
  • కన్నా లక్ష్మీ నారాయణ చేరిక పెద్ద డ్రామా
  • వైసీపీలోకి కన్నాను తీసుకోకుండా అమిత్‌ షా వారించారు

త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల తరువాత బీజేపీ, వైసీపీ తమ బుద్ధిని బయటపెడతాయని, అందుకోసం ఇప్పటికే వ్యూహాలు రచించుకున్నాయని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ నాయకులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, ఆ తీరు సరికాదని అన్నారు.

కన్నా లక్ష్మీనారాయణ చేరిక పెద్ద డ్రామా అని, వైసీపీలోకి ఆయనను తీసుకోకుండా జగన్‌ని అమిత్‌ షా వారించాడని అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ నెల 30న తిరుపతి తారకరామ మైదానంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగే బహిరంగ సభలో తాము బీజేపీ, వైసీపీ తీరును ప్రజలకు వివరిస్తామని చెప్పారు. దేశం మొత్తం తిరుపతి సభపై చర్చించేలా తాము ఆ సభను నిర్వహించనున్నామని వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News