tet: ఏపీలో కొలువుల జాతర.. 10,351 పోస్టులకు నోటిఫికేషన్లు

  • డీఎస్సీ, టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
  • మే 4న టెట్ నోటిఫికేషన్
  • జులై 6న డీఎస్సీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో కొలువుల జాతరకు తెర లేచింది. ఏకంగా 10,351 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ షెడ్యూల్ ను విశాఖపట్నంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మే 4న టెట్ నోటిఫికేషన్, జులై 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు.

మే 5 నుంచి 22 వరకు టెట్ దరఖాస్తులను స్వీకరిస్తారని చెప్పారు. జూన్ 3 నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ అవుతాయని తెలిపారు. జూన్ 10 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. టెట్ అభ్యర్థులకు మాక్ టెస్టులను నిర్వహిస్తామని చెప్పారు. జులై 7 నుంచి డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తామని గంటా తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా ఆన్ లైన్ లో డీఎస్సీని నిర్వహిస్తామని చెప్పారు. 

  • Loading...

More Telugu News