Rahul Gandhi: రాహుల్ గాంధీ మార్క్... ఏపీ నుంచి దిగ్విజయ్ సింగ్ కు టాటా!

  • ఉమెన్ చాందీని నియమించిన రాహుల్
  • కేరళకు సీఎంగా పనిచేసిన చాందీ
  • కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గా ఉన్న దిగ్విజయ్ సింగ్ ను తొలగించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దిగ్విజయ్ సింగ్ స్థానంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని ఏపీ వ్యవహారాల పర్యవేక్షణ నిమిత్తం నియమించినట్టు రాహుల్ కార్యాలయం ఈ ఉదయం ఓ ప్రకటనలో తెలిపింది.

2014లో రాష్ట్రం విడిపోకముందు నుంచి దిగ్విజయ్ సింగ్ ఈ పదవిలో ఉండగా, ఆయన్ను తెలంగాణకు దూరం చేస్తూ, ఇటీవలే ఆ రాష్ట్రానికి కుంతియాను ఇన్ చార్జ్ గా కాంగ్రెస్ నియమించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏపీ పదవి నుంచి కూడా ఆయన్ను తొలగించారు. మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో దిగ్విజయ్ అవసరం ఎక్కువగా ఉందని భావించిన రాహుల్, ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇటీవల కర్ణాటకలో బీజేపీని అధికారానికి దూరం చేసిన కాంగ్రెస్, ఆ క్రెడిట్ మొత్తాన్ని రాహుల్ కు ఇస్తుండగా, త్వరలో ఎన్నికలు జరిగే రాజస్థాన్ సహా, బీహార్, గుజరాత్ వంటి ప్రాంతాల్లో కీలక సంస్థాగత మార్పులను రాహుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
Rahul Gandhi
Digvijay Singh
Omen Chandi
Andhra Pradesh

More Telugu News