saidharam tej: మళ్లీ ఆ దర్శకుడికే ఛాన్స్ ఇచ్చిన మెగా హీరో!

  • 'తేజ్ ఐ లవ్ యూ' పూర్తి చేసిన మెగాహీరో 
  • కిషోర్ తిరుమలతో నెక్స్ట్ మూవీ 
  • ఆ తరువాత ప్రాజెక్టు గోపీచంద్ మలినేనితో

ప్రేమకథల స్పెషలిస్ట్ గా పేరున్న కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ .. 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా చేశాడు. రీసెంట్ గా ఈ సినిమా టాకీపార్టును పూర్తిచేసుకుంది. దాంతో కిషోర్ తిరుమలతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి తేజు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి ఒక సినిమా చేయనున్నట్టు చెబుతున్నారు.

 భగవాన్ - పుల్లారావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చేనెలలో ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ లుక్ కొత్తగా ఉంటుందనీ .. ఆయన నటనలో కొత్తకోణాన్ని గోపీచంద్ ఆవిష్కరించనున్నాడని అంటున్నారు. గతంలో 'విన్నర్'తో ప్లాప్ ఇచ్చిన గోపీచంద్ కి సాయిధరమ్ తేజ్ మరో ఛాన్స్ ఇవ్వడం విశేషంగా చెప్పుకుంటున్నారు.  

  • Loading...

More Telugu News