senior ias shashank: ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ కుమారుడిని కాల్చిచంపిన ఉగ్రవాదులు!

  • ఢిల్లీలో పెళ్లికి హాజరు..ఆపై మిత్రులతో కలిసి టర్కీ వెళ్లిన శుభమ్
  • ఇస్తాంబుల్ లో ఉగ్రవాదులతో ఘర్ఝణ
  • కాల్పుల్లో మృతి చెందిన శుభమ్(24)

తెలంగాణలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ కుమారుడు శుభమ్ గోయల్ (24) హత్యకు గురయ్యాడు. ఢిల్లీలో ఓ పెళ్లికి శుభమ్ గోయల్ హాజరయ్యాడు. అక్కడి నుంచి తన స్నేహితులతో కలసి టర్కీ పర్యటనకు వెళ్లాడు. అయితే, టర్కీలోని ఇస్తాంబుల్ లో ఉగ్రవాదులతో ఘర్షణ జరగగా, వారు కాల్పులు జరపడంతో శుభమ్ మృతి చెందినట్టు సమాచారం. శుభమ్ మృతి చెందిన సమాచారం ఈ నెల 26న అతని కుటుంబసభ్యులకు తెలిసింది. కాగా, శుభమ్ గోయల్ ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. అతని స్వస్థలం ఉత్తరాఖండ్ లోని రూర్కీ. శుభమ్ మృతదేహాన్ని రూర్కీకి తరలించారు. 

  • Loading...

More Telugu News