Chandrababu: వీఆర్ఏలకు చంద్రబాబు బంపర్ బొనాంజా!

  • వీఆర్ఏల వేతనాలను పెంచిన ప్రభుత్వం
  • రూ.6 వేల నుంచి రూ.10,500కు పెంపు
  • నాలుగేళ్లలో మూడు  రెట్లు పెంచామన్న బాబు

గ్రామ రెవెన్యూ సహాయకులకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. వారి వేతనాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.6 వేలుగా ఉన్న వారి వేతనాన్ని రూ.10,500కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. వీఆర్ఏల కష్టాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో వారి వేతనాలను మూడు రెట్లు పెంచినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై వీఆర్ఏ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం నేతలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News