Karnataka: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

  • నాకు ఓటు వేసిన హిందువుల కోసమే పని చేయాలి
  • ముస్లింలకు ఎటువంటి పనులు చేయొద్దు
  • తమ కార్పొరేటర్లతో చెప్పిన ఎమ్మెల్యే బసవగౌడ

కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వేసిన హిందువుల కోసమే పని చేయాలని, ముస్లింలకు ఎటువంటి పనులు చేయొద్దని తమ కార్పొరేటర్లకు బసవగౌడ సూచించిన ఓ వీడియో వైరల్ అయింది. కార్పొరేటర్లను కలిసిన బసవగౌడ ఈ మేరకు వారికి చెప్పినట్టు సమాచారం. తన కార్యాలయంలోకి టోపీలు, బుర్ఖాలు ధరించి వచ్చే వారిని అనుమతించరాదని సంబంధిత సిబ్బందికి కూడా బసవగౌడ చెప్పినట్టు ఆ వీడియోలో ఉంది. కాగా, ఈ నెల 4న విజయపురలో జరిగిన ఓ కార్యక్రమంలో పాటిల్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. పాటిల్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో విమర్శలు తలెత్తాయి.

  • Loading...

More Telugu News