kalva: ప్రజాధనాన్ని దోపిడీ చేసిన వారు నీతులు మాట్లాడుతున్నారు: కాల్వ శ్రీనివాసులు

  • దాదాపు రూ.43,000 కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేశారు
  • జగన్ అవినీతి గురించి మాట్లాడుతున్నారు 
  • కావాలని పని గట్టుకుని ఏపీ సర్కారుపై విమర్శలు చేస్తున్నారు
  • వైసీపీకి మద్దతుగా బీజేపీ ఉంది 

నవ నిర్మాణ దీక్షలతో ఏటా ప్రజల్లోకి వెళుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈరోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... "కేంద్ర ప్రభుత్వం నమ్మించి ఎలా మోసం చేసిందో వివరిస్తున్నాం. భవిష్యత్‌లో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై మేము చర్చించాం. మా కార్యకర్తలకు త్వరలోనే శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఆగస్టు 15 నాటికి సుమారు 40,000 మందికి శిక్షణ ఇస్తాం.

మేము ఎవరూ, ఎన్నడూ చేయనంతగా అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నాం. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేస్తున్నాయి. బీజేపీ ఈ దేశాన్ని పాలిస్తోన్న కూటమికి నాయకత్వం వహిస్తోంది. అటువంటి పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది.. ఒకవైపు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది. లేనిది ఉన్నట్లు చూపిస్తోంది. చంద్రబాబు విశిష్టమైన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోంది.

దాదాపు 43,000 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోపిడీ చేసిన జగన్ అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ప్రజాధనాన్ని దోపిడీ చేసిన వారు నీతులు మాట్లాడుతున్నారు. కావాలని పని గట్టుకుని ఏపీ సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. వైసీపీకి మద్దతుగా బీజేపీ ఉంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అప్పట్లో గుంటూరు సభకు ముందు ఏం మాట్లాడారు? ఆ తరువాత ఎలా మాట్లాడుతున్నారో తెలుసు. వీటన్నింటినీ ప్రజలకు వివరించి చెబుతాం" అని అన్నారు. 

  • Loading...

More Telugu News