New Delhi: ఢిల్లీలో కలకలం... ఒకే ఇంట్లో 11 మృతదేహాలు!

  • బురారీ ప్రాంతంలో ఘటన
  • రంగంలోకి దిగిన పోలీసులు
  • మృతుల్లో ఏడుగురు మహిళలు

దేశ రాజధాని ఢిల్లీలో ఒకే ఇంట్లో 11 మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. బురారీ ప్రాంతంలో ఈ ఘటన జరుగగా, పోలీసులు రంగంలోకి దిగారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. కొన్ని మృతదేహాలు ఉరి వేసుకున్నట్టు కనిపిస్తుండగా, మరికొన్ని చేతులు కట్టేసి ఉన్న స్థితిలో నేలపై పడి ఉన్నాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి వచ్చి, మొత్తం ఇంటిని సీజ్ చేసి విచారణ ప్రారంభించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండవచ్చని, వీరంతా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడి ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News