Mumbai: అమ్మాయి వేధించిందంటూ వీడియో తీసి, యువకుడి ఆత్మహత్య!

  • ముంబైలోని విఠల్ వాడీలో రైలు కింద పడ్డ యువకుడు
  • అతని మొబైల్ లో సెల్ఫీ వీడియోను కనుగొన్న పోలీసులు
  • కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు

ప్రేమ పేరిట ఓ యువకుడు వేధిస్తున్నాడని ఆరోపిస్తూ, అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతాలు కోకొల్లలు. అయితే ముంబైలో మాత్రం సీన్ రివర్సయింది. ఓ అమ్మాయి తనను వేధిస్తోందని ఆరోపిస్తూ, ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సెల్ఫీ వీడియో తీసుకుని రైలు కిందకు దూకాడో యువకుడు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, కల్యాణ్ నగర్ ప్రాంతానికి చెందిన రాజేష్ భండారీ (22) రైల్వేల్లోనే కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతను ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో విఠల్ వాడి స్టేషన్ లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా, ఆపై విచారణ ప్రారంభించిన పోలీసులు, అతని మొబైల్ లో వీడియోను గుర్తించారు. తన చావుకు ఓ యువతి కారణమని చెప్పిన రాజేష్, ఆమె పేరును వెల్లడించలేదు. తన కుమారుడిని వలలో వేసుకున్న అమ్మాయి, డబ్బు కోసం నిత్యమూ వేధిస్తుండేదని రాజేష్ తల్లి ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News