Social Media: టీడీపీ నేతలు అన్యాయం చేస్తున్నారు... ఆత్మహత్య చేసుకుంటానని దివ్యాంగుడి సెల్ఫీ వీడియో హెచ్చరిక!

  • ఇల్లు, రుణం రాకుండా అడ్డుకుంటున్నారు
  • సోషల్ మీడియాలో శివరావు ఆరోపణ
  • నిలువరించేందుకు అధికారుల యత్నం

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలపై ఓ దివ్యాంగుడు సంచలన ఆరోపణలు చేశాడు. తనకు మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి ఇల్లు, బ్యాంకు నుంచి అప్పు మంజూరు కాకుండా నేతలు అడ్డుపడుతున్నారని పెరవలి మండలం వడ్లూరుకు చెందిన శివరావు అనే దివ్యాంగుడు ఆరోపించాడు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆయన, నేటి సాయంత్రంలోగా తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. ఈ వీడియో వైరల్ అవుతుండటంతో అతన్ని గుర్తించి నిలువరించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News