rayapati: ఏపీలో అత్యంత అవినీతిపరుడు కన్నా లక్ష్మీనారాయణ: టీడీపీ ఎంపీ రాయపాటి ఆరోపణ

  • వచ్చే ఎన్నికల్లో కన్నా ఓడిపోవడం ఖాయం
  • కక్ష సాధింపుల్లో భాగంగానే మా కంపెనీల్లో తనిఖీలు 
  • వచ్చే ఎన్నికల్లో నేను తప్పకుండా పోటీ చేస్తా
  • అవకాశమిస్తే మా అబ్బాయి కూడా పోటీ చేస్తాడు 

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో అత్యంత అవినీతిపరుడు కన్నా అని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయన ఓడిపోవడం ఖాయమని అన్నారు. ఈ సందర్భంగా తమకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీలో సీజీఎస్టీ విభాగం అధికారులు సోదాలు నిర్వహించిన విషయాన్ని రాయపాటి ప్రస్తావించారు.

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ కంపెనీల్లో తనిఖీలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ తనిఖీల కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణపు పనులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ప్రభుత్వం నుంచి తమ కంపెనీకి బకాయిలు రావాలని, ఆ బకాయిలు వస్తే కేంద్రానికి జీఎస్టీ చెల్లిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించకపోయినా చంద్రబాబు మొండిగా దీని నిర్మాణం చేస్తున్నారని కొనియాడారు.

వచ్చే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని, చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పిన రాయపాటి మరో ఆసక్తి కర వ్యాఖ్య చేశారు. చంద్రబాబు అవకాశమిస్తే తమ అబ్బాయి రంగబాబుని వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధం చేస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News