kcr: కేసీఆర్ కు దమ్ముంటే ఓయూకు వెళ్లాలి: జైపాల్ రెడ్డి

  • ఓయూకి రాహుల్ వెళ్లకుండా కేసీఆర్ అడ్డుకున్నారు
  • మోదీ చెంచా కేసీఆర్
  • శేరిలింగంపల్లి బహిరంగ సభలో జైపాల్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా శేరిలింగంపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ)కి రాహుల్ గాంధీ వెళ్లకుండా కేసీఆర్ అడ్డుకున్నారని, కేసీఆర్ కు దమ్ముంటే ఓయూకు వెళ్లాలని, అక్కడికి వెళ్లేందుకు భయమేస్తే తన వెంట ఆర్మీని తీసుకెళ్లాలని, లేకపోతే ఆయన్ని విద్యార్థులు కొట్టి చంపుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘మోదీ మిత్రుడు కేసీఆర్, మోదీ చెంచా కేసీఆర్. తెలంగాణలో సెటిలర్లు మా వాళ్లే అని కేసీఆర్ అంటారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామంటే మాకూ ఇవ్వాలని కేసీఆర్ అంటున్నారు!’ అని విమర్శించారు. తెలంగాణలో సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బంది రాలేదు కానీ, తెలంగాణ ప్రజలకే ఇబ్బందులొచ్చాయని విమర్శించారు. ఈ సభకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, గీతా రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు హాజరయ్యారు.  

  • Loading...

More Telugu News