janasena: జనసేనలో చేరిన పవన్ కల్యాణ్ బాల్య మిత్రులు

  • నిన్న రాత్రి పవన్ సమక్షంలో జనసేనలో చేరిన మిత్రులు
  • హైదరాబాద్ సెయింట్ జోసెఫ్ స్కూల్లో విద్యాభ్యాసం
  • జనసేన విజయం కోసం పని చేస్తామన్న బాల్య మిత్రులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాల్య మిత్రులు సమరసింహారెడ్డి, చన్న రాంరెడ్డి, బీఎం సతీష్ లు ఆ పార్టీలో చేరారు. జంగారెడ్డిగూడెంలో నిన్న రాత్రి వారు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి మిత్రులను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పవన్. హైదరాబాద్ సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పవన్ తో పాటు వీరు చదువుకున్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ మంచితనాన్ని కొనియాడారు. జనసేన అధికారంలోకి రావడానికి తాము పూర్తి స్థాయిలో పని చేస్తామని చెప్పారు. మరోవైపు, పవన్ కల్యాణ్ ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాల్లో పర్యటించనున్నారు. భూనిర్వాసితులతో భేటీ అవుతారు. 

  • Loading...

More Telugu News