cuddapha: రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం... బడా స్మగ్లర్‌ ఫయాజ్‌ అరెస్టు

  • కర్ణాటక రాష్ట్రం సంపెగహళ్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కడప పోలీసుల దాడులు
  • రాళ్లు విసిరి వాహనాలు తగులబెట్టిన స్మగ్లర్లు
  • ధైర్యంగా ఎదురొడ్డి నిందితుడితోపాటు కలప స్వాధీనం చేసుకున్న పోలీసులు

కర్ణాటక రాష్ట్రం సంపెగహళ్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కడప జిల్లా పోలీసులు దాడులు నిర్వహించి ఐదు కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో బడా స్మగ్లర్‌ ఫయాజ్‌ను కర్ణాటక పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. స్టేషన్‌ పరిధిలోని ప్రాంతాల్లో భారీ ఎత్తున ఎర్ర చందనం నిల్వ చేశారన్న సమాచారం మేరకు కడప పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరికి స్మగ్లర్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దుండగులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వారి వాహనాలను తగులబెట్టారు. ఫయాజ్‌ను పట్టుకోవడంతోపాటు భారీ మొత్తంలో ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News