saikumar: 'మహర్షి'లో మెయిన్ విలన్ ఆయనేనట!

  • విలేజ్ సెట్లో 'మహర్షి'
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
  • ఏప్రిల్ 5వ తేదీన విడుదల

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన విలేజ్ సెట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, విలన్ ఎవరై వుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా సాయికుమార్ కనిపించనున్నట్టు తాజా సమాచారం.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో గతంలో వచ్చిన 'ఎవడు' సినిమాలో మెయిన్ విలన్ గా సాయికుమార్ అద్భుతంగా నటించాడు. ఆ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ తో వంశీ పైడిపల్లి .. ఈ సినిమాలోను  విలన్ గా సాయికుమార్ నే తీసుకున్నాడట. సాయికుమార్ కెరియర్లో ఇది చెప్పుకోదగిన పాత్ర అవుతుందని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.      

  • Loading...

More Telugu News