ntv: ఎన్టీవీ కోటి దీపోత్సవానికి హాజరైన అమిత్ షా

  • ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ విచ్చేసిన అమిత్ షా
  • కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరు
  • వెంట వచ్చిన లక్ష్మణ్, జీవీఎల్, మురళీధరరావు

హైదరాబాదులో ఎన్టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమం భక్తుల మన్ననలను అందుకుంటోంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు అందుకుంటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ నేతలు మురళీధర్ రావు, జీవీఎల్ నరసింహారావులు కూడా వచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షాకు ఎన్టీవీ నరేంద్ర చౌదరి ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం అమిత్ షా ఇక్కడకు వచ్చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News