manirathnam: మరో భారీ మల్టీ స్టారర్ కోసం మణిరత్నం ప్రయత్నాలు

  • 'నవాబ్'తో హిట్ కొట్టిన మణిరత్నం 
  • మరో కథతో రంగంలోకి 
  • విజయ్ విషయంలోనే డౌటు  

మణిరత్నం దర్శకత్వంలో ఈ మధ్య తమిళంలో వచ్చిన 'చెక్క చివంత వానమ్' అక్కడ సక్సెస్ ను సాధించింది. తెలుగులో 'నవాబ్' పేరుతో వచ్చిన ఈ చిత్రం ఇక్కడ మంచి మార్కులు కొట్టేసింది. దాంతో మణిరత్నం మరో మల్టీ స్టారర్ కి రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సారి తన కథలో విజయ్ .. విక్రమ్ .. శింబు కథానాయకులైతే బాగుంటుందనేది ఆయన ఆలోచన.

దాంతో ఈ ముగ్గురిని ఒప్పించడానికి ఆయన రెడీ అవుతున్నాడని అంటున్నారు. విక్రమ్ .. శింబు డేట్స్ ఈజీగానే దొరుకుతాయనీ .. ఎటొచ్చి విజయ్ డేట్స్ దగ్గరే సమస్య రావొచ్చనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఇటీవల కాలంలో వరుస విజయాలతో విజయ్ రేంజ్ మరింతగా పెరిగిపోయింది. దాంతో కొంతమంది దర్శకులు ఆయనకి కథలు వినిపించేసి లాక్ చేసి మరీ పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మణిరత్నానికి విజయ్ దొరుకుతాడా? అనే సందేహాన్నే చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.    

  • Loading...

More Telugu News