telangana: తెలంగాణలో టీఆర్ఎస్ జోరు... కేసీఆర్ కు పట్టం కట్టిన ప్రజలు: టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ఫలితాలు

  • 66 స్థానాలను గెలుచుకోనున్న టీఆర్ఎస్
  • మహాకూటమి 37 స్థానాలకు పరిమితం
  • బీజేపీకి 7 స్థానాలు

తెలంగాణ ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే పట్టం కట్టబోతున్నారని టైమ్స్ నౌ తెలిపింది. కాసేపటి క్రితం ఈ సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించింది. మొత్తం 119 స్థానాలకు గాను 66 స్థానాలను గెలుచుకుని, అతి పెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరిస్తుందని చెప్పింది. మహాకూటమి 37 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. బీజేపీ 7 స్థానాల్లో గెలుస్తుందని, ఇతరులు 9 స్థానాలను కైవసం చేసుకుంటారని చెప్పింది. 

  • Loading...

More Telugu News