Isha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 16 నుంచి చరణ్ తో ఐటెం సాంగు 
  • ఫిలిం సిటీలో మహేశ్ 'మహర్షి'
  • 'మిస్టర్ మజ్ను' రిలీజ్ డేట్ 
  • విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రం

*  రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'వినయ విధేయ రామ' చిత్రం కోసం ఐటెం సాంగును ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాదులో వేసిన ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరిస్తారు. ఇందులో చరణ్ తో పాటు బాలీవుడ్ భామ ఈశా గుప్తా నటిస్తుంది.
*  మహేశ్ బాబు నటిస్తున్న 'మహర్షి' చిత్రం షూటింగ్ గత మూడు వారాలుగా హైదరాబాదు, రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూటింగ్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
*  అఖిల్ అక్కినేని నటిస్తున్న మూడో చిత్రం 'మిస్టర్ మజ్ను' రిలీజ్ డేట్ ఖరారైంది. జనవరి 25న దీనిని విడుదల చేయనున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
*  టాలీవుడ్ బిజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో నటించనున్నాడు. ప్రస్తుతం సూర్య హీరోగా 'ఎన్జీకే' చిత్రాన్ని నిర్మిస్తున్న డ్రీం వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దీనికి శ్రీకార్తీక్ దర్శకత్వం వహించే అవకాశం వుంది.

  • Loading...

More Telugu News