sumanth: 'ఇదం జగత్' విడుదల తేదీ ఖరారు

  • సుమంత్ హీరోగా 'ఇదం జగత్'
  • దర్శకుడిగా అనిల్ శ్రీకంఠం 
  • ఈ నెల 28వ తేదీన విడుదల

సుమంత్ కథానాయకుడిగా అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో 'ఇదం జగత్' సినిమా నిర్మితమైంది. అంజు కురియన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి విడుదల తేదీని నిర్ణయించారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో క్రైమ్ న్యూస్ రిపోర్టర్ గా సుమంత్ కనిపించనున్నాడు.

రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా టీమ్ ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ను సాధిస్తుందనే నమ్మకంతో వాళ్లు వున్నారు. ఇంతవరకూ సుమంత్ చేసిన పాత్రలకి పూర్తి భిన్నమైన పాత్రను ఈ సినిమాలో ఆయన చేశాడు. ఈ సినిమా తప్పకుండా తనకి హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. ఆయన ఆశించినట్టుగానే జరుగుతుందేమో చూడాలి. 

  • Loading...

More Telugu News