Guntur District: కుమార్తెకు సీమంతం చేసి ఇంటికి తీసుకెళ్తుండగా ప్రమాదం.. తల్లీ కుమార్తెల మృతి

  • గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఘటన
  • ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు
  • ముగ్గురి మృతి.. మరో ముగ్గురు ఆసుపత్రి పాలు

కుమార్తెకు ఘనంగా సీమంతం చేసి పుట్టింటికి తీసుకెళ్తున్న ఆ కుటుంబంలో విధి విషాదం నింపింది. పుట్టబోయే బిడ్డ గురించి కోటి కలలు కంటూ ఇంటికి బయలుదేరిన ఆమె కలలను రోడ్డు ప్రమాదం రూపంలో దూసుకొచ్చిన మృత్యువు మధ్యలోనే తుంచేసింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని యడవల్లిలో జరిగిన ఈ ఘటన హృదయాలను కలచివేసింది.

ఆదివారం అర్ధరాత్రి తల్లీ కుమార్తెలు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లీకుమార్తెలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. మృతులను గుంటూరుకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News