raana: 'విరాటపర్వం 1992' .. హీరోగా రానా

  • కొత్త కాన్సెప్ట్ తో వేణు ఉడుగుల 
  • రానా జోడీగా సాయిపల్లవి 
  • 40కోట్ల బడ్జెట్ తో నిర్మాణం 

కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ నటుడిగా రానా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తనకి గల క్రేజ్ ఎంత మాత్రం తగ్గకుండగా నిలుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే రానా మరో విభిన్నమైన సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 'నీదీ నాదీ ఒకే కథ' చిత్రం ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఉడుగుల, ఒక కొత్త కాన్సెప్ట్ తో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు.

'విరాటపర్వం 1992' అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయకుడిగా రానాను సంప్రదించగా ఆయన వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట. ఇక కథానాయిక పాత్రకిగాను సాయిపల్లవిని ఎంపిక చేసుకున్నారు. దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితం కానుందని అంటున్నారు. ముందుగా హీరో పాత్ర శర్వానంద్ దగ్గరికి వెళ్లిందనీ, ఈ జోనర్ తనకి సెట్ కాదని ఆయన చెప్పడంతో రంగంలోకి రానాను దింపారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

  • Loading...

More Telugu News