kiara adwani: కోటికి పైనే చెబుతోన్న కైరా అద్వాని?

  • మహేశ్ జోడీగా తెలుగులో పరిచయం
  • బన్నీ సరసన అలరించే ఛాన్స్ 
  • భారీగా పెంచేసిన పారితోషికం

'భరత్ అనే నేను'తో తెలుగు తెరకి కైరా అద్వాని పరిచయమైంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, తమ సినిమాల్లోకి ఆమెను తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె చరణ్ జోడీగా 'వినయ విధేయ రామ' సినిమాలో చేసేసింది. అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ సినిమాలో కథానాయికగా ఈ సుందరి పేరే ఎక్కువగా వినిపిస్తోంది. దాదాపుగా ఆమె ఎంపిక ఖరారైపోయిందనే అంటున్నారు.

దాంతో ఆమె తన పారితోషికం పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది ఒక సినిమాను చేయడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారట. కోటికి పైగా ఆమె పారితోషికం అడగడంతో, నిర్మాతలు కంగుతున్నారని సమాచారం. ఆమెకి అంత ఇచ్చుకోలేక మరో హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారట. బన్నీ సినిమా తరువాత ఆమె పారితోషికం మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పుకుంటున్నారు.

  • Loading...

More Telugu News