jallikattu: జల్లికట్టులో విషాదం.. పలువురి పరిస్థితి విషమం

  • తమిళనాడులో జోరుగా సాగుతున్న జల్లికట్టు
  • మధురై జిల్లా అవనీయపురంలో అపశ్రుతి 
  • తీవ్రంగా గాయపడ్డ 11 మంది

సంక్రాంతి సందర్భంగా ఏపీలో కోడి పందేలు జోరుగా సాగుతుండగా... ఇదే సమయంలో తమిళనాడులో జల్లికట్టు అదే స్థాయిలో జరుగుతోంది. జల్లికట్టు సందర్భంగా తమిళనాడులోని మధురై జిల్లా అవనీయపురంలో అపశ్రుతి దొర్లింది. ఈ పోటీల్లో పాల్గొన్న 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎద్దులను నిలువరించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తమిళనాడులో జల్లికట్టు పోటీలను భారీ ఎత్తున నిర్వహించడం ఆనవాయతీగా వస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడు వ్యాప్తంగా ఈ క్రీడ జోరుగా సాగుతోంది.

  • Loading...

More Telugu News