Chandrababu: టీడీపీలో కోట్ల కుటుంబం చేరికపై స్పందించిన ఎంపీ బుట్టా రేణుక

  • ఎంపీ సీటు సూర్యప్రకాష్ రెడ్డికేనని ప్రచారం
  • టికెట్ల విషయం అధిష్ఠానం చూసుకుంటుంది
  • చంద్రబాబు అందరికీ న్యాయం చేస్తారు

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎంపీ బుట్టా రేణుకకు రానున్న ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ టికెట్ ఇస్తారని అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీలో చేరిపోవడం, కర్నూలు ఎంపీ సీటు ఆయనకే ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో కోట్ల చేరికపై బుట్టా రేణుక ఎలా స్పందిస్తారా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. తాజాగా ఈ విషయమై  ఆమె మాట్లాడుతూ.. టీడీపీలోకి ఎవరొచ్చినా.. పార్టీ బలోపేతమవుతుందన్నారు. టికెట్ల విషయం అధిష్ఠానం చూసుకుంటుందని.. అందరికీ న్యాయం చేసేలా చంద్రబాబు నిర్ణయం ఉంటుందని బుట్టా రేణుక స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News