bheemili: భీమిలి సీటు నాదే.. జగన్ హామీ ఇచ్చారు: వైసీపీ సమన్వయకర్త విజయనిర్మల

  • వైసీపీలో చేరుతున్న అవంతి శ్రీనివాస్
  • భీమిలి టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటూ వార్తలు
  • భీమిలి వైసీపీలో కలకలం

అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఆయనకు విశాఖ జిల్లా భీమిలీ అసెంబ్లీ సీటును జగన్ కేటాయించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, భీమిలి వైసీపీలో కలకలం మొదలైంది. భీమిలి టికెట్ తనదేనని వైసీపీ సమన్వయకర్త విజయనిర్మల చెప్పారు. టికెట్ విషయంలో జగన్ తనకు ఇప్పటికే హామీ ఇచ్చారని తెలిపారు. పార్టీలో ఎవరైనా చేరవచ్చని అన్నారు. పార్టీ అధిష్ఠానం నుంచి తనకు పిలుపు రాలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News