Andhra Pradesh: గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్.. ఘనస్వాగతం పలికిన వైసీపీ నేతలు!

  • ఏలూరులో నేడు బీసీ గర్జన సభ
  • డిక్లరేషన్ ప్రకటించనున్న జగన్
  • సభాస్థలికి కారులో ప్రయాణం

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో ఈరోజు ‘బీసీ గర్జన’ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సభ వేదికపై నుంచే వైసీపీ అధినేత జగన్ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. అధికారంలోకి వస్తే బీసీల సంక్షేమం కోసం చేపట్టే చర్యలను జగన్ ప్రజలకు వివరించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా జగన్ కు వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముస్తాఫా, పార్టీ నేతలు కె.పార్థసారధి, వెల‍్లంపల్లి శ్రీనివాస్‌, జోగి రమేష్‌, యార్లగడ్డ వెంకట్రావు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్‌ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నేతలంతా రోడ్డు మార్గం ద్వారా ఏలూరులోని సభాస్థలికి బయలుదేరారు.

  • Loading...

More Telugu News