kidari sarveswararao: కిడారి, సోమలను చంపడానికి కారణమిదే: మావోయిస్టు నేత గణేష్

  • ఆదివాసీలకు ద్రోహం చేశారు
  • జైల్లో ఉంచి వేధించారు
  • సామ్రాజ్యవాదులకు ఏజెంట్లుగా మారారు

ఆదివాసీలకు ద్రోహం చేస్తూ, సామ్రాజ్యవాదులకు ఏజెంట్లుగా మారినందుకే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను హతమార్చామని ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన నుంచి విశాఖ మీడియా ప్రతినిధులకు ఓ లేఖ అందింది. టీడీపీలో చేరిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించారని లేఖలో పేర్కొన్నారు. ఆదివాసీలపై కక్షగట్టి వారిని 5 నెలలుగా జైల్లో ఉంచి వేధించారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి అక్రమ అరెస్టులను నిలిపివేయాలని... లేకపోతే స్థానిక నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News