Nara Lokesh: డేటా ఎత్తుకుపోయిన కేటీఆర్ పై సిట్ వేయించిన కేసీఆర్... అదే తేలుతుందన్న లోకేశ్!

  • డేటా ఇచ్చింది మీకే
  • ఆ విషయం తేలుతుంది
  • ట్విట్టర్ లో నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాను తెలంగాణ నేత కేటీఆర్ దొంగతనం చేస్తే, దానిపై కేసీఆర్ సిట్ వేయించారని, ఆ డేటాను ఇచ్చింది మీకేనని (జగన్) తేలుతుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "మీ కోసం చోరీ చేసిన‌ డేటా కేసు ద‌ర్యాప్తుకు కేసీఆర్ సిట్ వేయించారు. ఇక్క‌డ డేటా ఎత్తుకుపోయింది కేటీఆర్‌... ఇచ్చింది మీకేన‌ని తేలనుంది" అని అన్నారు. అంతకుముందు మరో ట్వీట్ లో "సెల్ఫ్‌ గోల్ స్పెష‌లిస్ట్ జ‌గ‌న్ గారూ! కోడిక‌త్తి కేసు మోడీగారు మోజుప‌డి ఎన్ఐఏతో ద‌ర్యాప్తు చేయించారు. పొడిచింది వైకాపా కార్య‌క‌ర్త‌, పొడిపించుకున్న‌ది మీరేన‌ని తేల్చింది" అని కూడా అన్నారు. ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.






  • Loading...

More Telugu News