farooq: ఏపీ మంత్రి ఫరూక్ ఓటు గల్లంతు.. వైసీపీ కుట్ర అంటూ మండిపడ్డ మంత్రి

  • ఎన్నికల్లో 8 సార్లు పోటీ చేసిన నా ఓటే గల్లంతైంది
  • నా కుటుంబసభ్యులు, బంధువుల ఓట్లు కూడా గల్లంతయ్యాయి
  • ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ అక్రమ మార్గాలను ఎంచుకుంది

ఏపీలో సాక్షాత్తు మంత్రి ఫరూక్ ఓటు గల్లంతయింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, తనతో పాటు తన కుటుంబసభ్యులు, బంధువుల ఓట్లు కూడా తొలగించారని అన్నారు. నంద్యాలలో టీడీపీ సానుభూతిపరులైన మైనార్టీల ఓట్లను కూడా తొలగించారని మండిపడ్డారు. ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్ అధికారికి ఫిర్యాదు చేశానని చెప్పారు. ఎన్నికల్లో 8 సార్లు పోటీ చేసిన తన ఓటే గల్లంతైతే... సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనికంతా వైసీపీనే కారణమని చెప్పారు. ఎన్నికల్లో గెలవడానికి అక్రమ మార్గాలను ఎంచుకున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News