Mahesh Babu: మండుటెండల్లో 'మహర్షి' షూటింగ్

  • మండుటెండల్లో 'మహర్షి' షూటింగ్
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • మే 9వ తేదీన భారీస్థాయి విడుదల    

ప్రస్తుతం మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా చేస్తున్నాడు. మహేశ్ బాబుకి ఇది 25వ సినిమా కావడం వలన, సంఖ్యా పరంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది.అప్పుడే ఎండలు మండిపోతున్నాయి .. ఈ మండుటెండలను కూడా లెక్కచేయకుండా, 'మహర్షి' సంబంధించిన చిత్రీకరణ అవుట్ డోర్లో జరుగుతోంది. ఎంతో అంకితభావంతో ఈ సినిమా టీమ్ పనిచేస్తోంది. ఈ సినిమా షూటింగు జరుగుతోన్న లొకేషన్ నుంచి మహేశ్ బాబు కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. ఎండల కారణంగా .. మహేశ్ బాబు షాట్ గ్యాప్ లో వెంటనే నీడకి వచ్చేస్తున్నట్టుగా ఈ స్టిల్స్ ను బట్టి తెలుస్తోంది. అశ్వనీదత్ .. దిల్ రాజు .. పీవీపీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, అల్లరి నరేశ్ ఒక కీలకమైన పాత్రను చేస్తోన్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, మే 9వ తేదీన విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News